‘గల్లీబాయ్’ తర్వాత రణ్వీర్సింగ్, అలియాభట్ మరోసారి వెండితెరపై జంటగా కనిపించబోతున్నారు. వీరిద్దరి కలయికలో బాలీవుడ్ అగ్ర దర్శకనిర్మాత కరణ్జోహార్ ఓ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ‘రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ పేరుతో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు కరణ్జోహార్ మంగళవారం ప్రకటించారు. ఐదేళ్ల విరామం తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న పూర్తిస్థాయి చిత్రమిది కావడం గమనార్హం. ఇందులో బాలీవుడ్ సీనియర్ నటులు ధర్మేంద్ర, జయాబచ్చన్, షబానా అజ్మీ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ‘రెగ్యులర్ లవ్స్టోరీస్కు భిన్నంగా ఉండే చిత్రమిది. ఈ సినిమాలో రాఖీ, రాణి ప్రేమను కొత్త కోణంలో పునర్నిర్వచించబోతున్నారు. వారి ప్రేమప్రయాణం సరికొత్త అనుభూతిని పంచుతుంది’ అని కరణ్జోహార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. 1988 తర్వాత ఈ సినిమాలో ధర్మేంద్ర, షబానా ఆజ్మీ కలిసి నటించబోతున్నారు. 2022లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది.