చివ్వెంల, మే 28 : కరోనా పేషెంట్లు ప్రభుత్వం అందిస్తున్న మందులు వేసుకుని ధైర్యంగా ఉండాలని జడ్పీటీసీ భూక్యా సంజీవ్నాయక్ అన్నారు. మండలంలోని మున్యానాయక్తండా, రోళ్లబండతండాలో శుక్రవారం జ్వర సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా హోం ఐసొలేషన్లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చివ్వెంల, బండమీది చందుపట్లలో మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనుమానితులు ప్రభుత్వ దవాఖానల్లో కరోనా పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్ వచ్చినవారు జనాల్లో తిరుగకుండా ఐసొలేషన్లో ఉండాలని పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉన్నట్లు సమాచారం ఇస్తే ఆశ కార్యకర్తలు ఇంటికి వచ్చి మెడికల్ కిట్ అందజేస్తారని తెలిపారు. భయానికి లోనై ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. లాక్డౌన్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, అనవసరంగా బయట తిరగొద్దని కోరారు. కార్యక్రమంలో డీఎల్పీఓ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ కె.జమలారెడ్డి, ఎంపీఓ గోపి, మండల వైద్యాధికారి రాజ్కుమార్, సర్పంచ్ బానోతు బికారు, ఎంపీటీసీ ధరావత్ సుశీల, హెల్త్ సూపర్వైజర్ శిరోమణి, పంచాయతీ కార్యదర్శి వసంత పాల్గొన్నారు.
అందరి ఆరోగ్య వివరాలు తీసుకోవాలి
సూర్యాపేట రూరల్ గ్రామాల్లోని ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తినీ సర్వే చేయాలని ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం ఆరోగ్య సిబ్బందికి సూచించారు. మండలంలోని సోలిపేట గ్రామంలో నిర్వహిస్తున్న జ్వర సర్వేను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. గ్రామాల్లో ఆరోగ్య బృందాలు కొవిడ్ సర్వే కొనసాగిస్తూ జ్వరం, ఒంటి నొప్పులు, గొంతునొప్పి, దగ్గు ఉన్నవారికి తప్పనిసరిగా మందుల కిట్ అందించాలన్నారు. ఆక్సిజన్ లెవెల్స్ 94 కంటే తక్కువగా ఉంటే వెంటనే దవాఖానకు పంపించాలని సూచించారు. కరోనా విస్తరిన్నందున విందులు, వినోదాలకు దూరంగా ఉంటూ వైరస్ తగ్గుముఖం పట్టే వరకు ఇండ్లల్లోనే ఉండాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్నాయుడు, వైద్య సిబ్బంది, అంగన్వాడీలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
మఠంపల్లి : జ్వర సర్వేలో భాగంగా మండల కేంద్రంలో అంగన్వాడీ, ఆరోగ్య సిబ్బందితో కలిసి సర్పంచ్ మన్నెం శ్రీనివాస్రెడ్డి ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కొవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.