టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ త్రివిక్రమ్-అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్లో వచ్చిన చిత్రం అల వైకుంఠపురంలో (Ala Vaikunthapuramlo). పూజాహెగ్డే ఫీమేల్ లీడ్ రోల్లో నటించింది. గతేడాది జనవరిలో వచ్చిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కాగా ఈ సినిమాను బాలీవుడ్ యాక్టర్ కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి షెహ్జాదే (Shehzade) టైటిల్ను ఖరారు చేశారు. షెహ్జాదే విడుదల తేదీని ఫైనల్ చేశారు మేకర్స్.
2022 నవంబర్ 4న ఈ చిత్రానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. రోహిత్ ధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, అల్లు అరవింద్, ఎస్ రాధా కృష్ణ, అమన్ గిల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది అల వైకుంఠపురంలో. మరి కంటెంట్ను నమ్ముకుని హిందీలో రీమేక్ చేస్తున్న కార్తీక్ ఈ చిత్రం ఏ స్థాయిలో కలిసొస్తుందో తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.
రీమేక్లో ఒరిజినల్ వెర్షన్ లో పూజాహెగ్డే పోషించిన పాత్రలో బాలీవుడ్ నటి కృతిసనన్ కనిపించబోతుంది. టబు పాత్రలో అలనాటి అందాల తార మనీషా కొయిరాలా నటిస్తోంది. జయరాం పాత్రలో పరేశ్ రావల్ నటిస్తున్నాడు.
ఇది కూడా చూడండి
Jacqueline Fernandez | ‘నీలిరంగు చీరలోనా..సందమామా నీవే జాణ’
Sunny Leone | స్వర్గంలో ఏంజెల్లా సన్నీలియోన్
Prakash Raj Panel | 11 మంది ప్రకాశ్రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామా
Benerjee | మోహన్ బాబు నన్ను కొట్టడానికి వచ్చారు: బెనర్జీ