కరోనా మహమ్మారి బుసలు కొడుతున్న సమయంలో ఎందరో నిరాశ్రయులవుతున్నారు. కొందరు ఆక్సిజన్ లేక సరైన చికిత్స దొరక్క ప్రాణాలు విడుస్తున్నారు. పేద ప్రజలుని ఆదుకునేందుకు సోనూసూద్తో పాటు పలువురు ప్రముఖులు నడుం బిగించారు. తమకు తోచినంత సాయం చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన వంతుగా కరోనా రోగులకు ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
రకుల్ ఇప్పటికే కొంత సొమ్ము సమకూర్చగా, తన స్నేహితుల ద్వారా మరికొంత మొత్తాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు సేకరించిన నిధులతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సమకూర్చేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తోంది . సోనూసూద్ కూడా ఇలాంటి ప్రయత్నం చేయగా, రకుల్ చేస్తున్న ఈ మంచి పని విజయవంతం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాగా, రకుల్ కెరీర్ విషయానికి వస్తే క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయగా, ఈ మూవీ విడుదలకి సిద్ధంగా ఉంది. మరోవైపు తమిళం, హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.