పీర్జాదిగూడ, జూన్ 6 : కరోనా మొదటిదశ, రెండోదశ సాగుతున్న సమయంలో కూడా రాష్ట్రంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. ఆదివారం పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో రూ.1.70 కోట్ల వ్యయంతో సీసీ రోడ్డు, పార్కు, 5 స్వచ్ఛ ఆటోలను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, మేయర్ జక్క వెంకట్రెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంభించారు. 17వ డివిజన్లో భూగర్భ డ్రైనేజీ, బీబీ సాహెబ్ ముక్తాలో హుడా పార్కు ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పీర్జాదిగూడ నగరపాలక సంస్థ అభివృద్ధిలో దూసుకెళ్లుతున్నదని, స్వచ్ఛ పీర్జాదిగూడగా తీర్చిదిద్దేందుకు మేయర్ వెంకట్రెడ్డి కృషి చేయడం హర్షనీయమన్నారు. అనతి కాలంలోనే నగరపాలక సంస్థను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న మేయర్,అధికారులను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ శివకుమార్గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్,కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.