బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా వలన కొంత స్లో అయ్యాడే కాని లేదంటే ఏడాదికి మూడు సినిమాలు విడుదల కావలసిందే. విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులని అలరించే అక్షయ్ కుమార్ ప్రస్తుతం రక్షా బంధన్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలోని తన పాత్ర కోసం 5 కేజీల బరుపు పెరిగారు. పాత్ర కోసం బరువు తగ్గడం లేదా పెరిగే ప్రాసెస్ను బాగా ఎంజాయ్ చేస్తాను అని అంటున్నాడు అక్షయ్.
రక్షా బంధన్ సినిమా కోసం తాను సహజమైన పద్ధతిలోనే పెరిగాడట. బరువు పెరిగే క్రమంలో తన అమ్మ చేతి హల్వా తినే అదృష్టం కూడా దొరికిందని అంటున్నాడు అక్షయ్. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో రక్షా బంధన్ సినిమా తెరకెక్కుతుండగా, ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబయ్లో జరుగుతోంది. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చేఆలోచన చేస్తున్నారు మేకర్స్. కాగా, అక్షయ్ సూర్యవంశీ సినిమా కోసం 5 కేజీలు తగ్గిన విషయం తెలిసిందే.