ముంబై: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ యూకే నుంచి సోమవారం తెల్లవారుఝామున ముంబైకి వచ్చాడు. అతని తల్లి అరుణ భాటియా తీవ్ర అస్వస్థతకు గురై ముంబైలోని హీరానందాని హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.
అమ్మను అమితంగా ప్రేమించే అక్షయ్ విషయం తెలియగానే హుటాహుటిన లండన్ నుంచి ముంబై వచ్చాడు. గత రెండు వారాల నుంచి తన తర్వాతి మూవీ సిండ్రెల్లా కోసం అక్షయ్ షూటింగ్లో పాల్గొంటున్నాడు. తాను ఇండియాకు తిరిగి వచ్చినా.. తాను లేని సీన్లను చిత్రీకరించాలని మూవీ యూనిట్ను అక్షయ్ కోరాడు.