లాక్డౌన్ తర్వాత తొలిసారి కెమెరాముందుకొచ్చారు అక్షయ్కుమార్. సోమవారం కొత్త సినిమా ‘రక్షాబంధన్’ షూటింగ్ మొదలుపెట్టారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. క్లాప్ బోర్డ్ చేతిలో పట్టుకొని దర్శకుడితో సెట్స్లో ముచ్చటిస్తున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో అక్షయ్ పోస్ట్చేశారు. ‘నిజజీవితంలో నాకు పరిచయమైన తొలి స్నేహితురాలు సోదరి అల్క. అవధులు లేని స్నేహబంధం మాది. ‘రక్షాబంధన్’ సినిమాను అల్కకు అంకితం ఇస్తున్నా’ అని అక్షయ్ పేర్కొన్నారు. నలుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా ఈ సినిమాలో అక్షయ్కుమార్ కనిపించబోతున్నారు. ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భూమి ఫడ్నేకర్ కథానాయికగా నటిస్తోంది.