అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే కాంబినేషన్ లో వస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నుంచి యే జిందగీ లిరికల్ వీడియో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఆకాశమంతా ఆనందమై తెల్లారుతోందే నాకోసమై..ఆలోచనంతా ఆరాటమై..అన్వేషిస్తోందే ఈ రోజుకై అంటూ పూజాహెగ్డే, అఖిల్ మధ్య సాగే ట్రాక్ మెలోడియస్గా మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను హనియా నఫీస, గోపీసుందర్ పాడారు. గోపీసుందర్ కంపోజ్ చేశాడు. బొమ్మరిల్లు భాస్కర్, డైరెక్టర్ మోహన్రాజాతో కలిసి సరదాగా కారులో డ్రైవ్ చేస్తూ పాటను ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు గోపీసుందర్, హనియా నఫీస డ్రైవ్లో సాంగ్ను పాడుతూ హమ్ చేస్తున్నారు. యే జిందగీ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి మరి.