అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్కు హిట్ అనేది అందని ద్రాక్షగా మారింది. ఇప్పటికే మూడు సినిమాలలో నటించిన ఏ సినిమా కూడా మంచి విజయం అందించలేకపోయిది. దీంతో తన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీపై హోప్స్ పెట్టుకున్నాడు.ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించడంతో చిత్రంపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక త్వరలో సురేందర్ రెడ్డితో స్పై థ్రిల్లర్ చేయనున్నాడు అఖిల్. స్పై థ్రిల్లర్గా రూపొందనున్న ఈ చిత్రానికి ఏజెంట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రీసెంట్గా చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేయగా, ఇది ఎంతగానో ఆకట్టుకుంది.
తాజా సమాచారం ప్రకారం ఆర్ఎక్స్ 100 చిత్రంతో మంచి హిట్ కొట్టిన అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, తిరుపతి నేపథ్యంలో సినిమా రూపొందనున్నట్టు తెలుస్తుంది. కాగా, అజయ్ భూపతి ప్రస్తుతం మహా సముద్రం చిత్రంతో బిజీగా ఉన్నాడు. శర్వానంద్,సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో ఈ చిత్రం రూపొందుతుంది.