మన్సూరాబాద్, జూలై 1: పట్టణ ప్రగతిలో భాగంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించడం, పరిశుభ్రతను మెరుగుపర్చడమే లక్ష్యంగా పని చేస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. గురువారం మన్సూరాబాద్ డివిజన్ పరిధి ఆగమయ్యకాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీలు, కాలనీల్లో ఓపెన్ నాలాలు, మ్యాన్హోళ్లలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ హయత్నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, ఏఎంహెచ్ఓ మంజుల వాణి, నాయకులు రేణుకుంట్ల రాఘవేందర్, షౌకత్అలీ పాల్గొన్నారు.
నియోజకవర్గంలోని మూడు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో పట్టణ ప్రగతి కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. హయత్నగర్ సర్కిల్ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్లో ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చైతన్యపురి డివిజన్లో సాయినగర్ కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సరూర్నగర్ సర్కిల్ ఉప కమిషనర్ హరి కృష్ణయ్యతో కలిసి కార్పొరేటర్ రంగా నర్సింహగుప్తా ప్రారంభించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి రవీందర్, ఏఎంఓహెచ్ జ్యోతి, ఏఈ స్వర్ణకుమార్, నాయకులు శంకర్, వినోద్యాదవ్, శివ, చారీ, రవన్న, పరంధాములు తదితరులు పాల్గొన్నారు. గడ్డిఅన్నారం డివిజన్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని వివేకానందనగర్ కాలనీలో ఉప కమిషనర్ హరి కృష్ణయ్యతో కలిసి కార్పొరేటర్ ప్రేం మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కొత్తపేట డివిజన్లోని కమర్షియల్ టాక్స్ కాలనీలో కార్పొరేటర్ పవన్కుమార్ పట్టణప్రగతిని ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఈ మాతృనాయక్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అంజయ్యగౌడ్, సురేందర్, రామకృష్ణ, సుందర్ , తిరుమల్, చరణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతిలో ప్రజలు భాగస్వాములై అభివృద్ధికి సహకరించాలని నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె కాలనీలవాసులతో కలిసి మొక్కలు నాటారు. నాగోల్ డివిజన్ పట్టణ ప్రగతి ఇన్చార్జి రాజారావు, అధికారులు చంద్రశేఖర్ రెడ్డి, మధుకర్, శ్రీనివాస్, పృథ్వీ, మేద, జవాన్ శ్రీనివాస్, నాయకులు వస్పరి మల్లేష్, డప్పు రాజు, సంజీవరెడ్డి, దశరథ్ సాగర్, వినోద్ రెడ్డి, మైసం రాజేశ్, గురువయ్య, శ్రీనివాస్, మహేశ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
డివిజన్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని బీఎన్రెడ్డినగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ, కాలనీ అధ్యక్షుడు రాజిరెడ్డి, ఎలక్ట్రికల్ డీఈ పున్నా నాయక్, ఏఈ గౌతమ్ రాజ్, వాటర్ వర్క్స్ మేనేజర్ భవ్య, అర్చన, నాయకులు శ్రావణ్రెడ్డి, కాలనీ సభ్యులు పురుషోత్తం రెడ్డి, అలెగ్జాండర్, ధన్రాజ్, పాపిరెడ్డి, రాంరెడ్డి, నవీన్రెడ్డి, భిక్షపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.