ఉత్తరకాశీ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ శ్రేణుల్లో ప్రముఖ ఆలయమైన గంగోత్రి ఆలయం తెరుచుకుంది. కొవిడ్ నేపథ్యంలో తలుపులు తెరిచే వేడుకను శనివారం ఉదయం నిరాడంబరంగా నిర్వహించారు. ఆలయ పూజారులతోపాటు కొద్ది మంది అధికారులు వేడకకు హాజయ్యారు. అక్షయ తృతీయ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహణకు ఈ ఉదయం 7 గంటల 31 నిమిషాలకు తలుపులను తెరిచామని గంగోత్రి ఆలయ పూజారి రవీంద్ర సెమ్వాల్ తెలిపారు.
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎంపిక చేసిన కొద్ది మంది అధికారులు, ఆలయ కమిటీ సభ్యులను మాత్రమే తలుపులు తెరిచే వేడుకకు అనుమతించినట్లు వెల్లడించారు. ఆలయం తెరిచిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ తరఫున తొలిపూజ నిర్వహించారు. ఉత్తరాఖండ్లో కొవిడ్ విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది ఛార్దామ్ యాత్ర రద్దయ్యింది.
దీంతో సాధారణ పూజల నిర్వహణకు షెడ్యూల్ ప్రకారం హిమాలయ శ్రేణుల్లోని నాలుగు ఆలయాల తలుపులను తెరిచారు. యువనోత్రి ఆలయ తలుపులు గత నెల 14న, కేదర్నాథ్ ఆలయం 17న, బద్రీనాథ్ ఆలయాన్ని 18న తెరిచిన విషయం తెలిసిందే. ఆలయాన్ని తెరిచినా భక్తులనెవరినీ దర్శనానికి అనుమతించబోమని ఆలయ వర్గాలు తెలిపాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.