బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అఖండ’. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రగ్యాజైస్వాల్ కథానాయికగా నటిస్తోంది. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. ప్రస్తుతం తమిళనాడులో పతాక ఘట్టాలకు సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్ను తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణతో పాటు ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. స్టంట్ శివ నేతృత్వంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ను ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు భిన్న గెటప్లలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.