తమిళ స్టార్ హీరో అజిత్కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అజిత్ నటించిన వాలిమై సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. దీపావళికి విడుదల చేయాలని భావించినా కూడా వాలిమై ను ఇప్పడు వచ్చే నెల సంక్రాంతి సందర్బంగా జనవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.
వాలిమై చిత్రంలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ విలన్గా నటిస్తున్నాడు. హుమ కురేషి హీరోయిన్ గా నటించగా, హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు.. బోనీ కపూర్ నిర్మించాడు. అయితే వాలిమై సినిమా చిత్రీకరణ సమయంలో కూడా చెన్నై నుండి హైదరాబాద్ కు అజిత్ బైక్ రైడ్ చేసిన విషయం అందరికి తెల్సిందే
అజిత్ బైక్ రైడింగ్ని చాలా ఇష్టపడతాడు అనే విషయం మనకు తెలిసిందే. బైక్ పై కొన్ని వందలు.. వేల కిలో మీటర్ల ప్రయాణంను ఆయన చేస్తూ ఉంటాడు. తాజాగా అజిత్ వాఘా సరిహద్దు వద్ద ఉండే దగ్గర వద్ద నిల్చుని మూడు రంగుల జెండా పట్టుకుని ఫొటోలకు ఫోజు ఇచ్చాడు. ప్రస్తుతం అజిత్ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.