తమిళ అగ్ర హీరో అజిత్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి పి.సుబ్రమణియం (85) శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నారు. పి.సుబ్రమణియం మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.
అజిత్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అగ్ర నటులు కమల్హాసన్, దళపతి విజయ్ సైతం సుబ్రమణియం మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశానవాటికలో సుబ్రమణియం అంత్యక్రియల్ని పూర్తిచేశారు.