కరోనా వలన ప్రజల పరిస్థితి ధైన్యంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో పేద ప్రజలను ఆదుకోవడానికి సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే తమిళ నటులు సూర్య, కార్తీ సీఎం సహాయనిధికి కోటి రూపాయలు విరాళం అందించగా, తమిళ దర్శకుడు మురుగ దాస్ రూ.25 లక్షలు అందించారు. తాజాగా అజిత్ కూడా పాతిక లక్షలు సీఎం సహాయనిధికి ఆన్లైన్ ద్వారా పంపారు. గత ఏడాది కరోనా విజృంభిస్తున్న సమయంలో అజిత్ విరాళం అందించిన విషయం తెలిసిందే.
అజిత్ ప్రస్తుతం ‘వాలిమై’ అనే సినిమాతో బిజీగా ఉండగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేలో విడుదల కావలసి ఉన్నప్పటికీ కరోనా వలన ఫస్ట్ లుక్ వాయిదా వేశారు. ఈ సినిమా బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగనుందని తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఈ సినిమా చాలా వరకు చిత్రీకరణ జరుపుకుంది.ఆ తర్వాత స్పెయిన్ లో షూట్ చేస్తున్నారు. తెలుగు యంగ్ హీరో కార్తికేయ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ లో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.