డిస్కవరీ చానల్ వారి ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బియర్ గ్రిల్స్తో కలిసి పలువురు ప్రముఖులు సాహసాలు చేయగా, అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, సూపర స్టార్ రజనీకాంత్,ఖిలాడీ కుమార్ అక్షయ్ ఉన్నారు. ఇప్పుడు అజయ్ దేవగన్ పాల్గొననున్నారు. మాల్దీవులలో అజయ్ దేవగణ్, బియర్ గ్రిల్స్ అద్భుతమైన సాహసాలు చేయనున్నారు.
50 ఏళ్ల అజయ్ దేవగణ్కి ఇలాంటి సాహసాలు ఏమి కొత్త కాదు. బియర్ గ్రిల్స్తో అజయ్ చేసే సాహసాలు చూసి ప్రేక్షకులు నోరెళ్లపెట్టడం ఖాయం అని అంటున్నారు. కాగా, 2019 లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మ్యాన్ వర్సెస్ వైల్డ్
చిరస్మరణీయ ఎపిసోడ్ లో నటించారు. ఈ ఎపిసోడ్ కోసం పిఎం మోడీ తో ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో షూట్ చేయగా.. అక్షయ్ కుమార్ – రజనీకాంత్ గత ఏడాది కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ లో షూట్ చేశారు. అజయ్ దేవగణ్ ఎపిసోడ్కి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.