నాగర్కర్నూల్ : అచ్చంపేట పట్టణంలోని సాయి నగర్ కాలనీలో వింత సంఘటన చోటు చేసుకుంది. వరాహం (పంది) నిద్రిస్తూ ఉండగా.. దాని పాలను పిల్లి తాగింది. ఈ సంఘటనను గమనించిన పట్టణ ప్రజలు, కాలనీవాసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పంది తన పిల్లలకే కాక పిల్లికి పాలు ఇవ్వడం ఏంటని, అరుదైన సంఘటనగా పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. అంతేగాక జాతివైరం మరిచి పంది పిల్లికి పాలివ్వడం పట్ల జంతువులకున్న సఖ్యత, మనుషుల్లో లేకపాయే.. అంటూ కొందరు పేర్కొనడం గమనార్హం.