బాలీవుడ్లో షారుఖ్ఖాన్, ఐశ్వర్యరాయ్ విజయవంతమైన జోడీగా గుర్తింపును సొంతం చేసుకుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దేవదాస్’, ‘మెహబ్బతేన్’ చిత్రాలు పెద్ద విజయాల్ని సాధించాయి. హిట్పెయిర్గా కొనసాగిన ఈ జోడి మధ్య ఓ దశలో మనస్పర్థలు తలెత్తినట్లు సమాచారం. ఆ కారణంగానే వీర్జారా, చల్తేచల్తేతో పాటు మరికొన్ని సినిమాల్లో ఐశ్వర్యరాయ్ తొలగించి ఆమె స్థానంలో మరొకరిని హీరోయిన్గా షారుఖ్ఖాన్ తీసున్నారు. ఈ వివాదంపై గతంలో ఐశ్వర్యరాయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. ‘మేమిద్దరం కలిసి ఐదు సినిమాలు చేయాల్సింది. కారణం చెప్పకుండా ఆ సినిమాల నుంచి నన్ను తొలగించారు. ఆ సంఘటన నన్ను ఎంతగానో బాధపెట్టింది. ఆ నిర్ణయం తీసుకోవడం వెనకున్న కారణాలేమిటో షారుఖ్ను నేను అడగలేదు’ అంటూ ఐశ్వర్యరాయ్ తెలిపింది. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్..మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది.