Telugu Indian Idol Promo | తెలుగు ప్రేక్షకుల నుంచి ‘ఆహా’ ఓటీటీ సంస్థకు విశేష ఆధరణ వస్తుంది. ఆహా సంస్థ కూడా ప్రతి వారం ఓ కొత్త సినిమాను విడుదల చేస్తూ.. సరికొత్త రియాలిటీ షోస్తో నిత్యం ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది. ఇండియాలో ఎంతో పాపులర్ అయిన ‘ఇండియన్ ఐడల్’ను అదే పేరుతో ఆహా సంస్థ సింగింగ్ రియాలిటీ షోను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టాలెంటెండ్ సింగర్స్కు ఆహా సంస్థ గొప్ప అవకాశాన్ని ఈ షో ద్వారా కల్పిస్తుంది. ప్రముఖ సింగర్ శ్రీ రామ్చంద్ర హోస్ట్గా చేస్తున్న ఈ షోలో సంగీత దర్శకుడు థమన్, నటి నిత్యామీనన్, సింగర్ కార్తిక్లు జడ్జ్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ షో తుది దశకు చేరుకుంది. ఇటీవలే జరిగిన సెమీ ఫీనాలే ఎపిసోడ్కు బాలకృష్ణ గెస్ట్గా వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే.
ఈ సెమీ ఫీనాలేలో ఆరుగురు కంటెస్టెంట్లలో లాలస ఎలిమినేట్ అయింది. ఇక ఫినాలే ఎపిసోడ్లో మిగిలిన ఐదుగురిలో ఒకరు ఇండియన్ ఐడల్ టైటిల్ విజేతగా నిలవనున్నారు. ఇక ఫినాలే ఎపిసోడ్కు
మెగాస్టార్ చిరంజీవి గెస్ట్గా రానున్నాడు. చిరుతో పాటు ‘విరాటపర్వం’ ప్రమోషన్లో భాగంగా రానా, సాయిపల్లవి ఈ ఎపిసోడ్లో పాల్గొన్నారు. తాజాగా ఆహా సంస్థ ఫినాలే ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో తెలుగు ఇండియన్ ఐడల్కు ఒక అభిమానిగా వచ్చాను. ఇది వాత్సవం అంటూ చిరంజీవి పేర్కొన్నాడు. ఈ ప్రోమో చిరంజీవి సందడి అంతా ఇంతా లేదు. ప్రోమోను చూస్తుంటూనే ఎప్పుడెప్పుడు ఫినాలే ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ జూన్ 17నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా సంస్థ తెలిపింది.