జాతి రత్నాలు సినిమాతో మొన్నటికి మొన్న బాక్సాఫీస్ దగ్గర రచ్చే చేసాడు నవీన్ పొలిశెట్టి. అయితే ఇలాంటి ఓ చాకు లాంటి కుర్రాడు అని తెలుగు ఇండస్ట్రీకి చూపించిన సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. అప్పటికి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఈ హీరో.. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే రాసుకుని ఎన్నో కష్టాలు పడి స్వరూప్ ఆర్ఎస్జేతో కలిసి వర్కవుట్ చేసాడు. తీరా సినిమా రెడీ అయిన తర్వాత కూడా ఇప్పట్లో డిటెక్టివ్ సినిమాలు ఎవడు చూస్తాడంటూ అంతా రిజెక్ట్ చేసారు. అలాంటి సందర్భంలోనూ ధైర్యం కోల్పోకుండా కథపై నమ్మకంతో చాలా తక్కువ థియేటర్స్ లో సినిమాను విడుదల చేసారు. అలా జూన్ 21, 2019న విడుదలైంది ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. అప్పుడే ఈ చిత్రం వచ్చి రెండేళ్లు అయిపోయింది. ఎలాంటి అంచనాలు లేకుండా అద్భుతమైన విజయం సాధించింది ఈ చిత్రం. మరి ఆత్రేయ వసూళ్లు ఎంతో ఇప్పుడు చూద్దాం..
నైజాం- 1.89 కోట్లు
సీడెడ్- 0.75 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.79 కోట్లు
ఈస్ట్- 0.22 కోట్లు
వెస్ట్- 0.19 కోట్లు
గుంటూరు- 0.31 కోట్లు
కృష్ణా- 0.26 కోట్లు
నెల్లూరు- 0.47 కోట్లు
ఏపీ + తెలంగాణ- 4.88 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్- 0.81 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్- 5.69 కోట్లు
నవీన్ పొలిశెట్టి అంటే ఎవరో అప్పటికి తెలియకపోయినా కూడా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాను 3.8 కోట్లకు కొన్నారు బయ్యర్లు. వాళ్ల నమ్మకమే నిజమై.. సినిమా దాదాపు 6 కోట్లు షేర్ వసూలు చేసి.. 2 కోట్ల లాభాలు అందించింది.