బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కొద్ది రోజుల క్రితం ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు ఆంజియోప్లాస్టీ సర్జరీ నిర్వహించగా, ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని, విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఆయన మేనేజర్ ఇటీవల తెలిపాడు. తాజాగా ఆయన కూతురు ఓ వీడియో షేర్ చేయగా, అందులో అనురాగ్ కశ్యప్ లుక్ అందరికి షాకిచ్చింది. పూర్తిగా గుండు చేయించుకుని , కను బొమ్మలు నిండుగా ఒత్తైన గడ్డంతో ఇతడు అతడేనా అన్నట్లుగా ఆశ్చర్యం కలిగించేలా కనిపించాడు.
ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ ఇంట్లో కుటుంబ సభ్యులతో సరాదా సమయాన్ని గడుపుతున్నాడు. సడెన్గా ఆయన కూతురు ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనురాగ్ అందరిని ఆశ్చర్యపరిచాడు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్స్ దక్కించుకున్న అనురాగ్ కశ్యప్ ప్రస్తుతం మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్దంగా ఉన్నాడు. ఒకానొక సమయంలో ఆయన ఆరోగ్యంపై అందరిలో ఆందోళన నెలకొని ఉండగా, ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారని సమాచారం