వరంగల్ అర్బన్ : లాక్డౌన్ కాలంలో పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్ల సహాయం నిమిత్తం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) 20 ఉచిత భోజన పంపిణీ కేంద్రాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఫ్రంట్లైన్ కార్మికులుగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులు, ఆశా సిబ్బందికి ఉచిత భోజనాలు అందించేందుకు జీడబ్ల్యూఎంసీ చర్యలు చేపట్టిందన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. విలీన గ్రామాల నుండి నగరానికి వచ్చే సిబ్బందికి జీడబ్ల్యూఎంసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.