యంగ్ హీరో అడివి శేష్ కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసందే. అడివి శేష్ డెంగ్యూ బారిన పడగా, ఆయనకు రక్తంలో ప్లేట్లెట్స్ అకస్మాత్తుగా తగ్గిపోవడంతో సెప్టెంబర్ 18న ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుండి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శేష్ ఈ రోజు ఉదయం డిశ్చార్జ్ అయ్యారు.
అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న ఆయన.. సోమవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని అడివి శేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ఇంటికి తిరిగి వచ్చాను. విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటాను అని తన ట్వీట్లో పేర్కొన్నారు. ఆయన ప్రస్తుతం 26/11 ముంబై టెర్రర్ అటాక్లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ అనే సినిమా చేస్తున్నారు.
మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్.. ఏ ప్లస్ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. శశికిరణ్ తిక్క మేజర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ హిట్ సిక్వెల్లోనూ అడివి శేషు నటిస్తున్నాడు.