రామంతాపూర్, ఏప్రిల్ 25 : రామంతాపూర్ ప్రభుత్వ హోమియో వైద్యశాలలో ఏర్పాటు చేయబోయే ఐసొలేషన్ సెంటర్ను మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వైద్యశాలలో ఐసొలేషన్ సెంటర్లో ఏర్పాట్లను పరిశీలించా రు. సెంటర్లో కరోనా రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై తగిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీదేవి, సిబ్బంది పాల్గొన్నారు.