గ్రాఫిక్స్ లేని రోజుల్లో ప్రేక్షకులకి సరికొత్త థ్రిల్ని అందించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369.తొలి ఇండియన్ సైప్స్ ఫిక్షన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి మూల కారణం దివంగత గాయకుడు బాలసుబ్రహ్మణ్యం అని చెప్పుకొచ్చారు హీరో బాలకృష్ణ ,దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ,నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్.
ఓ సందర్భంలో సింగీతం తన మనసులో ఉన్న ట్రైమ్ ట్రావెల్ లైన్ గురించి బాలుకి చెప్పారు. ఎస్పీబీ ఎగ్జయిట్ అయి, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ని సింగీతంని కలవమన్నారు. అలా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగడానికి ఎస్పీబీ కారణం అయ్యారు. ‘ఆదిత్య 369’ ప్రత్యేకత ఏంటంటే… ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటుంది. ‘ఆదిత్య 369’చిత్రాన్ని ఈ రోజులకు కూడా అన్వయించుకునేలా ఉంటుంది.
‘ఆదిత్య 369’ చేసేటప్పుడు చాలామంది సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారని అన్నారు బాలకృష్ణ. ఈ సినిమాకు గుండెకాయ శ్రీ కృష్ణదేవరాయలు పాత్ర. ఈ సినిమాలో ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది. గ్రాఫిక్స్ లేని రోజుల్లో మొట్టమొదటిసారి వి.హెచ్.ఎస్ కెమెరాతో షూట్ చేసి… సినిమా నెగటివ్ మీదకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. భారతీయులు ఇటువంటి సినిమా చేయగలరని నిరూపించాం. ముందు ముందు ‘ఆదిత్య 369’కి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది’’ అన్నారు బాలకృష్ణ. ఆదిత్య 369 చిత్రం 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ వీడియో విడుదల చేశారు.