పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తోన్న తాజాచిత్రం ఆదిపురుష్ (Adipurush). తానాజీ ఫేం ఓం రావత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్ (Prabhas) లార్డ్ రాముడి పాత్రలో కనిపించబోతుండగా..బాలీవుడ్ (Bollywood) అందాల తార కృతిసనన్ (Kriti Sanon) సీత పాత్రలో నటిస్తోంది. సన్నీసింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. మైథలాజికల్ మాగ్నమ్ ఓపస్ గా వస్తున్న ఈ మూవీ ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది.
మంగళవారం సాయంత్రం నుంచి ప్రభాస్, కృతిసనన్, సన్నీసింగ్ కు సంబంధించిన కొన్ని స్టిల్స్ నెట్టింట్లో హల్ చేల్ చేస్తున్నాయి. ఈ ముగ్గురు డ్యాన్స్ రిహార్సల్స్ లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఈ ముగ్గురిపై డైరెక్టర్ ఓం రావత్ స్పెషల్ సాంగ్ ను షూట్ చేయబోతున్నట్టు బీ టౌన్ వర్గాల టాక్. ఈ వారమే ఈ స్పెషల్ సాంగ్ ను షూట్ చేస్తున్నారట. ముంబైలోని స్టూడియో గ్రీన్, బ్లూ స్క్రీన్స్ తో ఈ సినిమా ప్రధాన భాగం షూట్ చేయబోతున్నారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ డెమన్ కింగ్ లంకేశ్ గా కనిపించబోతున్నాడు.
భూషణ్ కుమార్, క్రిష్ణన్ కుమార్, ఓం రావత్, రాజేశ్ నాయర్ సంయుక్తంగా ఆది పురుష్ ను తెరకెక్కిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. దీంతోపాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న సలార్ సినిమా కూడా సెట్స్ పైనే ఉంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవికూడా చదవండి..
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!