ప్రభాస్ కథానాయకుడిగా రామాయణ గాథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నారు. కృతిసనన్ కథానాయిక. ఈ సినిమా తాజా షెడ్యూల్ శుక్రవారం ముంబయిలో ప్రారంభమైంది. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో ప్రభాస్, సైఫ్అలీఖాన్, కృతిసనన్తో పాటు ప్రధాన తారాగణంపై పతాక ఘట్టాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. రావణుడిని యుద్ధంలో రాముడు సంహరించే పోరాట సన్నివేశాలను అత్యాధునిక మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. కృతిసనన్ ఈ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్నది. వచ్చే ఏడాది ఆగస్ట్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.