హీరోగానే కాకుండా విలక్షణ పాత్రల్లో కనిపిస్తూ నటుడిగా వైవిధ్యతను చాటుకుంటున్నారు ఆది పినిశెట్టి. తాజాగా ఆయన విలన్గా నటించబోతున్నారు. రామ్ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టిని ప్రతినాయకుడిగా ఎంచుకున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘హీరో రామ్ను ఢీకొట్టే విలన్గా ఆది పినిశెట్టి పాత్ర శక్తివంతంగా ఉంటుంది. హీరో, విలన్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ పోటాపోటీగా ఉంటాయి. యూనిక్ క్యారెక్టరైజేషన్తో సాగే పాత్ర కావడంతో విలన్గా నటించడానికి ఆది అంగీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నాం’ అని తెలిపారు. కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్.