తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అద్భుతం’. మల్లిక్ రామ్ దర్శకుడు. ఈ చిత్రం ద్వారా సీనియర్ హీరో రాజశేఖర్ తనయ శివాని రాజశేఖర్ కథానాయికగా అరంగేట్రం చేస్తోంది. ప్రశాంత్శర్మ ఈ సినిమాకు కథనందించాడు. నేడు కథానాయిక శివాని పుట్టినరోజు సందర్భంగా చిత్ర ఫస్ట్లుక్ను హీరో నాని సోషల్మీడియా ద్వారా విడుదల చేశారు. ‘వినూత్న కథాంశమిది. నాయకానాయికల పాత్రలు నవ్యపంథాలో సాగుతాయి. తేజ సజ్జ, శివాని అభినయం ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. సత్య, మిర్చి కిరణ్, తులసి, శివాజీరాజా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: చింతా విద్యాసాగర్, సంగీతం: రదన్, ఎడిటర్: గ్యారీ బీహెచ్, నిర్మాణ సంస్థలు: మహాతేజ క్రియేషన్స్, ఎస్ ఒరిజినల్స్, స్క్రీన్ప్లే, సంభాషణలు: లక్ష్మీభూపాల, నిర్మాత: చంద్రశేఖర్ మొగుళ్ల, దర్శకత్వం : మల్లిక్రామ్.