అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సర్ఫేస్( Microsoft Surface Laptop 4) సిరీస్లో సరికొత్త ల్యాప్టాప్ను భారత మార్కెట్లోకి మంగళవారం విడుదల చేసింది. సర్ఫేస్ ల్యాప్టాప్ 4 పేరుతో విడుదల చేసిన ల్యాప్టాప్ ప్రారంభ ధర రూ.102,999గా నిర్ణయించారు. భారత్లోని కమర్షియల్, ఎడ్యూకేషన్ కస్టమర్ల కోసం కొత్త సర్ఫేస్ ల్యాప్టాప్ 4ను ఆవిష్కరించింది.
బ్లాక్, ప్లాటినమ్ కలర్లలో అందుబాటులో ఉంది. లాప్టాప్లను ఆథరైజ్డ్ రిటైల్ స్టోర్లు, ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. సర్ఫేస్ ల్యాప్టాప్ AMD రైజన్, ఇంటెల్ కోర్ చిప్సెట్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ల్యాప్టాప్ 4లో 13.5, 15 అంగుళాల టచ్స్క్రీన్ వేరియంట్లలో విడుదలైంది. AMD రైజన్ 5, 8జీబీ ర్యామ్, 256జీబీ ఎస్ఎస్డీ కలిగిన 13.5 అంగుళాల బేస్ మోడల్ ధర రూ.102,999గా ఉంది. 15 అంగుళాల AMD రైజెన్ 7, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్డి స్టోరేజ్ మోడల్ ధర రూ. 134,999గా ఉంది.
సర్ఫేస్ 13.5-inch ల్యాప్టాప్ స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే సైజ్: 13.5 అంగుళాలు
టచ్ స్క్రీన్: ఉంది
ప్రాసెసర్:రైజెన్ 5
ర్యామ్: 8జీబీ
ఓఎస్: విండోస్ 10 హోమ్
హార్డ్ డిస్క్: లేదు
ఎస్ఎస్డీ: 256జీబీ
సర్ఫేస్ 15-inch ల్యాప్టాప్ స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే సైజ్:15 అంగుళాలు
టచ్ స్క్రీన్: ఉంది
ప్రాసెసర్: రైజెన్ 7
ర్యామ్:8జీబీ
ఓఎస్:విండోస్ 10 హోమ్
హార్డ్ డిస్క్: లేదు
ఎస్ఎస్డీ:256జీబీ