హైదరాబాద్ : కరోనా ప్రభావం అన్ని వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. తాజాగా బ్యాంకింగ్ సెక్టార్పైనా దీని ప్రభావం పడింది. కొవిడ్ ఉధృతి నేపథ్యంలో బ్యాంకుల పనివేళల్లో గురువారం నుంచి మార్పు చోటు చేసుకోనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి.
కేవలం 50 శాతం మంది సిబ్బంది మాత్రమే విధులకు హాజరుకానున్నారు. తాజా నిర్ణయంతో రేపటి నుంచి ఈ నెల 20 వరకు కేవలం 4 గంటలు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నుంచి బ్యాంకులు, ఏటీఎం సేవలకు మినహాయింపు నిచ్చిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.