కరోనావైరస్ దెబ్బకు సినిమా ఇండస్ట్రీ దారుణంగా నష్టపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు నిర్మించడమే పెద్ద సాహసంగా మారిపోయింది. ఈ సమయంలో ముందు ఇచ్చినట్లు భారీ పారితోషికం ఇవ్వాలంటే నిర్మాతలకు తలకు మించిన భారమే అవుతుంది. అందుకే కొందరు హీరోలు, దర్శకులు స్వచ్ఛందంగా తమ పారితోషికంలో కోత విధించుకుంటున్నారు. ఈ క్రమంలో కుర్ర హీరో శర్వానంద్ సైతం రెమ్యునరేషన్ను కొంత తగ్గించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహా సముద్రం సినిమాలో నటిస్తున్నాడు శర్వానంద్. శర్వాతో పాటు సిద్ధార్థ్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహా సముద్రం సినిమాలో నటించడానికి సిద్ధార్థ్ మూడు కోట్లకు పైగా పారితోషికం అందుకున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. శర్వానంద్ కూడా ఈ సినిమాకు దాదాపు 5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి లాక్డౌన్ ముందు ఒక్క సినిమాకు 6 నుంచి 7 కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడు శర్వానంద్.
ఈ మధ్య ఈయన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం.. వైరస్ కారణంగా ఇండస్ట్రీ పరిస్థితులు కూడా బాగా లేకపోవడంతో తన పారితోషికంలో కోటి రూపాయలకు పైగా కోత పెట్టుకున్నాడు శర్వానంద్. సినిమా విడుదలైన తర్వాత మిగిలిన లావాదేవీలు చూసుకుందాం అంటూ నిర్మాతతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి ఈ సినిమా విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమం
‘మా’పై నాగబాబు మాటలు బాధించాయి: నటుడు నరేశ్
క్రికెటర్తో కూతురు పెళ్లి చేయబోతున్న డైరెక్టర్ శంకర్
ఉదయ్ కిరణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
చిరంజీవి సినిమాపై ఈ కన్ఫ్యూజన్ ఇంకెన్ని రోజులో.. ?
మాస్ట్రో : ఓటీటీలో నితిన్ సినిమా ?
19 ఏళ్ల కెరీర్ లో నితిన్ వదిలేసిన సినిమాలివే..!
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే