కుమ్రంభీం ఆసిఫాబాద్ : ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని జిల్లా ఇంచార్జ్, రామగుండం పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ తెలిపారు. జిల్లాలోని రెబ్బన మండలం గోలేటిలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. రెబ్బన పోలీస్ స్టేషన్ పరిధిలో నేనుసైతం కార్యక్రమంలో భాగంగా పోలీసుల పిలుపు మేరకు గోలేటి ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
సందర్భంగా సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ..సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వచ్చిన అందరికి అభినందనలు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నేరాలను అదుపు చేయవచ్చన్నారు. ఆడపిల్లలపై అఘాత్యాలకి ఏలాంటి అవకాశం ఉండదు. చిన్న పిల్లల కిడ్నాప్ లు జరగవన్నారు. దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.