చెన్నై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇవాళ చెన్నైలో జయలలిత సమాధి వద్ద పుష్ప నివాళి అర్పించారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితకథ ఆధారంగా తలైవీ చిత్రాన్ని కంగనా తీస్తున్న విషయం తెలిసిందే. ఆ ఫిల్మ్కు చెందిన ట్రైలర్ చాలా రోజుల క్రితమే రిలీజైంది. అయితే తలైవీ సినిమాను ఈ నెలలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నటి కంగనా.. చెన్నైలోని మెరీనా బీచ్లో ఉన్న జయ సమాధి వద్దకు వెళ్లి పుష్ప నివాళి అర్పించారు. విజయ్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాను రూపొందించారు. కరోనా నేపథ్యంలో తొలుత తలైవీ సినిమాను ఓటీటీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా.. థియేటర్ ఓనర్ల ఆందోళనతో మొదట ఆ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు అంగీకరించారు. తలైవి ఫిల్మ్లో కంగనా రనౌత్ జయలలిత పాత్ర పోషిస్తున్నది. ఈ ఫిల్మ్లో అరవింద స్వామి, సామ్నా కాసిమ్, సముతిరాకాని, భాగ్యశ్రీ, ప్రియమణి నటిస్తున్నారు.