ముంబై: కరోనా మహమ్మారి మరో యాక్టర్ను బలి తీసుకుంది. బాలీవుడ్ నటుడు బిక్రమ్జీత్ కన్వర్పాల్ కొవిడ్ కారణంగా మృతి చెందాడు. 52 ఏళ్ల బిక్రమ్ చనిపోయిన విషయాన్ని డైరెక్టర్ అశోక్ పండిత్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. రిటైర్డ్ ఆర్మీ మేజర్ అయిన బిక్రమ్జీత్ 2003లో తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించాడు. ఎన్నో సినిమాలు, సీరియళ్లు, వెబ్సిరీస్లలో సపోర్టింగ్ క్యారెక్టర్స్లో బిక్రమ్ నటించాడు.
అతని మృతికి నటుడు నీల్ నితిన్ ముకేష్ కూడా నివాళులర్పించాడు. స్పెషల్ ఆప్స్, ఇల్లీగల్-జస్టిస్, ఔట్ ఆఫ్ ఆర్డర్, ఆప్కే కమ్రే మే కోయి రెహతా హైలాంటి వెబ్ సిరీస్లలో బిక్రమ్ నటించాడు. సాహో, ఘాజీ అటాక్, రాకెట్ సింగ్లాంటి మూవీల్లోనూ అతడు కనిపించాడు.