అమరావతి,జూన్ 19: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తాజాగా ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని..మనం కేంద్రాన్ని అడగడం తప్పా.. ఇక చేయగలిగింది ఏమీ లేదని జగన్ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరం అని ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపామన్నారు. చేసిన వాగ్ధానం ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలని చాలాసార్లు విజ్ఞప్తి చేశానని గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా గాని ఇంకా ఏమన్నా చేయాలంటే చేయవచ్చు.. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది..సంకీర్ణ ప్రభుత్వం అయి ఉంటే ఆలోచించవచ్చు కానీ పూర్తి మెజారిటీ ఉన్నాగానీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మిన్నకుండిపోతోందని అన్నారు. తాను కేంద్రాన్ని అడుగుతున్నా అని సీఎం జగన్ చెప్పారు.
కేంద్ర ఏం చెబుతుంది అన్నదానిపై సీఎం క్లారిటీ ఇవ్వడం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించిన జగన్.. తరువాత మళ్లీ ఎప్పుడు అంశం గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రత్యేక హోదా గురించి జగన్ అడిగారని వైసీపీ నేతలు చెప్పడం తప్ప.. ఆయన దీనిపై నేరుగా ఎలాంటి ప్రకటన చేయలేదు.