ఉప్పల్, మే 25: కాప్రాలోని భూమితో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి స్పష్టంచేశారు. భూకబ్జాలని కొంతమంది పనిగట్టుకొని చేస్తు న్న ప్రచారంలో నిజంలేదని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ హబ్సిగూడలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కాప్రాలో ప్రభుత్వ భూమిని గతం లో కొందరు కబ్జా చేస్తున్నారని, సిబ్బందిపై దాడికి యత్నిస్తున్నారని తన దృష్టికి తాసిల్దా ర్ తీసుకొచ్చారని తెలిపారు. ప్రభుత్వ భూములు పరిరక్షించడంలో తాసిల్దార్కు మంచిపేరు ఉన్నదన్నారు. దాడిచేసేవారి నుం చి అధికారులకు రక్షణ కల్పించాలని డీసీపీని కోరామని తెలిపారు. ఎమ్మెల్యే ఫోన్చేశారు.. తాసిల్దార్ కబ్జాను అడ్డుకుంటున్నారు.. అని కక్షసాధింపులో భాగంగా కొంతమంది కోర్టు కు వెళ్లినట్టు తెలుస్తున్నదన్నారు. కేసుకు సం బంధించి తనకు ఎలాంటి పత్రాలుగానీ, సమాచారం గానీ లేదని, తనకు ఆ వ్యక్తులు గానీ, భూమిగానీ తెలియదని చెప్పారు. ప్రభుత్వ అధికారులను, సర్కారు భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా తనపై ఉన్నదని వివరించారు. తనపై నిరాధారణమైన ఆరోపణలు చేసేవారు, రుజువులుంటే చూపించాలని డిమాండ్చేశారు. ఉద్యమకారుడిగా విలువలతో కూడిన 20 ఏండ్ల రాజకీయ జీవితం తనదని చెప్పా రు. చట్టాన్ని గౌరవిస్తూ, తనపై వచ్చిన ఆరోపణలను కోర్టులోనే తేల్చుకుంటానని తెలిపారు. నిరాధార, అసత్య ఆరోపణలు చేసేవారిపై పరువునష్టం దావా వేస్తానని అన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు పన్నాల దేవేందర్రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ పావనిరెడ్డి, నేతలు వేముల సంతోష్రెడ్డి, వనంపల్లి గోపాల్రెడ్డి, బన్నాల ప్రవీణ్, బేతాల బాలరాజు, పల్లా కిరణ్కుమార్రెడ్డి, సాయిజెన్ శేఖర్, అరిటికాయల భాస్కర్, చింతల నర్సింహారెడ్డి పాల్గొన్నారు.