చెన్నై: భారత్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. రెండు డోసుల టీకాలు తీసుకున్న తర్వాత కూడా వైరస్ బారినపడే అవకాశాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి వారిలో వైరస్ తీవ్రత స్వల్పంగా ఉంటుందని, ఐసీయూల్లో చేరి వెంటిలేటర్ చికిత్స పొందాల్సిన పరిస్థితులు ఎదురుకావని స్పష్టం చేస్తున్నారు. ఐతే కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నా కూడా పలువురు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు.
కరోనాతో పోరాడుతూ తమిళనాడుకు చెందిన మరో ఇద్దరు పోలీస్ అధికారులు మృతిచెందారు.
ఇద్దరు అధికారులు కూడా రెండు డోసుల టీకా తీసుకున్నారు. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఈశ్వరన్(52), స్పెషల్ సబ్ఇన్స్పెక్టర్ రవి(57) కరోనాతో చనిపోయారు. కొవిడ్ సెకండ్ వేవ్లో చెన్నైలో మరణించిన పోలీసుల సంఖ్య 12కు పెరిగింది.