ఏన్కూరు, మే 6: అన్నదాతలకు జవాబుదారీగా ఉండి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ సూచించారు. రైతుబంధు సమితి మండల కమిటీకి ఎంపికైన అధ్యక్షుడికి, సభ్యులకు గురువారం స్థానిక టీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాములునాయక్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుబంధు, రైతుబీమా, విత్తనాలు, ఎరువులు, సరఫరాలో రైతులకు సహకరించాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని అన్నారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యంలో ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామన్నారు. సర్పంచ్ చిర్రా రుక్మిణి, ఏవో నర్సింహారావు, టీఆర్ఎస్ నాయకులు బానోత్ సురేశ్నాయక్, పూర్ణకంటి మైసారావు, భూక్యా చందులాల్, వాసిరెడ్డి నాగేశ్వరరావు, శోభన్నాయక్ తదితరులు పాల్గొన్నారు.