ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej)ను అబ్దుల్ (Abdul) అనే వ్యక్తి వెంటనే ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. సకాలంలో సాయిధరమ్ తేజ్ ను ఆస్పత్రిలో చేర్పించడంతో డాక్టర్లు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ క్రమక్రమంగా కోలుకుంటున్నాడు. స్పోర్ట్స్ బైకు (Sports Bike)పై నుంచి కింద పడ్డ సాయిధరమ్ తేజ్ కు డాక్టర్లు కాలర్ బోన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సాయిధరమ్ తేజ్ను సకాలంలో కాపాడిన అబ్దుల్ ఒక్కసారిగా హీరో అయిపోయాడు.
అయితే సీఎంఆర్ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న అబ్దుల్ చేసిన సాయానికిగాను మెగా కుటుంబం నుంచి అతనికి (అబ్దుల్) పెద్ద ఎత్తున బహుమతులు అందాయని పలు యూట్యూబ్ ఛానళ్ల లో కథనాలు తెరపైకి వచ్చాయి. పవన్ కల్యాణ్ ఓ కారును బహుమతిగా కూడా ఇచ్చాడంటూ కథనాల్లో కొందరు రాసుకొచ్చారు.తనపై వస్తున్న స్టోరీలతో విసుగు చెంది పోలీసులకు ఫిర్యాదు చేశాడు అబ్దుల్.
కొంతమంది తన గురించి తప్పుడు కథనాలు రాస్తున్నారని, తాను ఎవరి దగ్గర నుంచి డబ్బు కానీ, బహుమతులు కానీ తీసుకోలేదని అబ్దుల్ తెలిపాడు. అసంబద్దమైన ప్రచారంతో తన పనిని, కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని, దయచేసి తనను ఒంటరిగా వదిలేయాలని కోరారు.
Vijay Deverakonda | బాక్సింగ్ రింగ్ లో విజయ్ దేవరకొండ..లైగర్ స్టిల్ వైరల్
Nani | షాహిద్ కపూర్ గొప్ప నటుడు..రీమేక్ అద్భుతం
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!