టాలీవుడ్ సీనియర్ నటి ఆమని వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగా అలరించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జంబలకిడిపంబ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆమని ‘మిస్టర్ పెళ్లాం’, ‘శుభలగ్నం’, ‘అమ్మదొంగ’ వంటి ఎన్నో చిత్రాలతో మెప్పించారు. సెకండ్ ఇన్నింగ్స్లో సహాయ పాత్రలు పోషిస్తూ అలరిస్తుంది.
ఆమని సినిమాలలోనే కాదు ధారావాహికల్లోనూ నటిస్తున్నారు. తాజాగా ఆమని, నటి ఇంద్రజతో కలిసి ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైంది. అందులో తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంది ఆమని. తనకు ఐదేళ్ల సంవత్సరం నుండి సినిమాలు అంటే పిచ్చి అని ఆ సమయంలోనే శ్రీదేవి, జయసుధలను తలుచుకుంటూ వారిలా ఎప్పుడు నటిస్తానో అని అనుకునేదాన్ని చెప్పుకొచ్చింది.
జంబలకడి పంబ సినిమాలో మగవాళ్ళు ఆడవాళ్ళుగా ఎలా మారతారో నిజ జీవితంలోను అలా జరగాలని ఫన్నీ కామెంట్స్ చేసింది. మామిడి పండ్లు దొంగతనం చేసి తినడం అంటే చాలా ఇష్టమని తెలిపింది. ఇక తనకు సినిమాలలో నటించాలని ఉందని తన కుటుంబ సభ్యులతో చెప్పినప్పుడు .. ఆమె సినిమాల్లో చేయడమేమిటి.. అంత పెద్ద అందగత్తె కాదు అని ఆమని బంధువులు ఎగతాళి చేశారట. ఈ విషయం చెప్పి ఒకింత భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం ముత్యమంతా ముద్దు సీరియల్ లో డబ్బు ఆశ ఉన్న అత్తగా నటిస్తుంది.