ఆదిసాయికుమార్, పాయల్రాజ్పుత్ జంటగా విజన్ సినిమా పతాకంపై తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇటీవల ప్రారంభమైంది. కల్యాణ్ జీ గోగణ దర్శకుడు. నాగం తిరుపతిరెడ్డి నిర్మాత. సునీల్ కీలక పాత్రధారి. దర్శకుడు మాట్లాడుతూ ‘రొటీన్కు భిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమాకు ‘టి.ఎం.కె’ అనే వర్కింగ్ టైటిల్ను నిర్ణయించాం. ఆ పేరు వెనకున్న కథేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఆది సాయికుమార్ పాత్ర సరికొత్తగా ఉంటుంది. సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాం’ అని తెలిపారు. పూర్ణ, కబీర్దుహాన్సింగ్, ఠాకూర్ అనూప్సింగ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తిక్, సినిమాటోగ్రఫీ: బాల్రెడ్డి, ఎడిటింగ్: మణికాంత్.