యంగ్ హీరో రామ్, తమిళ దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్లో బైలింగ్యువల్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. రాక్స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
రామ్ సినిమాలో ఆది పనిశెట్టి కీలక పాత్ర పోషించనున్నాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు మేకర్స్ . ఆది పినిశెట్టికి స్వాగతం అంటూ చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేసింది. రామ్ ని ఢీ కొట్టే విలన్ పాత్రలో ఆది పినిశెట్టి కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఆయన కూడా షూటింగ్లో జాయిన్ కానున్నట్టు సమాచారం.