ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత మంచి స్పీడు మీదున్న రామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో బైలింగ్యువల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా శరవేవగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజా షెడ్యూల్స్ హైదరబాద్, వైజాగ్లలో ప్లాన్ చేశారు. ఇందులో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది.
చిత్రంలో రామ్కి విలన్గా ఎవరు నటిస్తారు అనే దానిపై అందరిలో అనేక సందేహాలు నెలకొన్నాయి. ముందు సీనియర్ నటుడు మాధవన్ నటించనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ కేవలం పుకార్లేనని స్వయంగా దర్శకుడు వెల్లడించాడు. ఆ తర్వాత తమిళ నటుడు ఆర్య విలన్ రోల్ చేయనున్నట్టు వార్తలు రాగా, ఇప్పుడు ఆది పినిశెట్టి అనే టాక్ వినిపిస్తుంది. ఆది ప్రస్తుతం పలు చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషిస్తూనే సపోర్టింగ్ క్యారెక్టర్స్ పోషిస్తున్నాడు.