కరోనా మహమ్మారి బుసలు కొడుతూనే ఉంది. ఈ వైరస్ వలన ఎందరో ప్రముఖులు కన్నుమూసారు. తాజాగా పదహారేళ్ల వయసులో సినీరంగ ప్రవేశం చేసిన ప్రముఖ గాయనిని పొట్టన పెట్టుకుంది. తప్పూ మిశ్రా తన గీతాలాపనతో ఎందరో శ్రోతలకు వీనుల విందు కలిగించారు. 160 ఒడియా సినిమాలు, 22 బెంగాళీ చిత్రాల్లో ఈమె పాటలు పాడిన తప్పూ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు.
కరోనా బారిన పడి కోలుకున్న తప్పూ మిశ్రా కొద్ది రోజులకి ఊపరితిత్తుల సంబంధిత వ్యాధితో మంచాన పడ్డారు. ఈమెకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ కళాకారుల సంక్షేమ నిధి నుంచి రూ.1 లక్ష ఆర్థిక సహాయం చేయగా, వాటితో చికిత్స చేయించుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా ఆమె అకాల మరణం చెందారు తప్పూ మిశ్ర మృతితో ఒడియా చలన చిత్ర రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.