డ్రగ్స్ కేసు (Tollywood Drugs Case) మనీలాండరింగ్ సంబంధించిన కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) టాలీవుడ్ ప్రముఖుల విచారణ కొనసాగిస్తుంది. ఈ విచారణలో భాగంగా ఇవాళ సినీ నటుడు నవదీప్ (Navdeep) ఈడీ ఎదుట హాజరవగా..విచారణ ముగిసింది. సుమారు 9 గంటలపాటు నవదీప్ ను ఈడీ విచారించింది. ఈడీ అధికారులు నవదీప్ బ్యాంకు ఖాతాలు పరిశీలించారు. ఎఫ్ క్లబ్ ద్వారా కెల్విన్ ఖాతాకు డబ్బులు బదిలీ అయినట్టు ఈడీ గుర్తించినట్టు తెలుస్తోంది.
నవదీప్, ఎఫ్ క్లబ్ (F Club), కెల్విన్ (Kelvin) లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. నవదీప్ ను అందుబాటులో ఉండాలని ఈడీ ఆదేశాలు జారీచేసింది. నవదీప్ ఎఫ్ క్లబ్ యజమాని కావడంతో..అక్కడ డ్రగ్స పార్టీలు ఏమైనా జరిగాయా..? సినీ పరిశ్రమకు చెందిన వారిలో ఎవరెవరు ఎఫ్ క్లబ్ కు వచ్చే వారు..కెల్విన్ తో ఉన్న పరిచయం, ఇతర ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు నవదీప్ ను విచారించినట్టు సమాచారం.
ఇప్పటికే డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రవితేజ, రానా, రకుల్ ప్రీత్ సింగ్, నందు, ఛార్మిలను ఈడీ విచారించింది. 2016లో నవదీప్ ఎఫ్ క్లబ్ లో చాలా పార్టీలను నిర్వహించాడు. ఈ పార్టీల్లో డ్రగ్స్ సరఫరా ఉండేదని గతంలో వార్తలు తెరపైకి రాగా..ఆ దిశగా కూడా ఈడీ అధికారులు విచారణ సాగించినట్టు తెలుస్తోంది.
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Sampath Nandi| సీటీమార్ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా..?
Shah Rukh Khan | స్టార్ హీరో ఓటీటీ ఎంట్రీ..!