తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న లెజెండ్స్ లో ఒకరు ఏసియన్ గ్రూప్ ఛైర్మన్ నారాయణ్ దాస్ కే నారంగ్. ఫైనాన్సింగ్, డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, ఎగ్జిబిషన్ ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్న వ్యక్తి. నైజాం ఏరియాలో వన్ ఆఫ్ ది టాప్ డిస్ట్రిబ్యూటర్ నారాయణ్ దాస్ నారంగ్. ఆయన ప్రొడక్షన్ హౌజ్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర తెలుగులో ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న నిర్మాణ సంస్థల్లో ఒకటి. ఈ బ్యానర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్ టైనింగ్ చేయడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం ఎస్వీసీసీ బ్యానర్ ఖాతాలో తొమ్మిది సినిమాలున్నాయని టాలీవుడ్ వర్గాల టాక్. వీటిలో నాగచైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ విడుదలకు రెడీగా ఉంది.
ఇక మరోవైపు ఇటీవలే ధనుష్-శేఖర్ కమ్ముల కాంబోలో సినిమాను కూడా ప్రకటించారు. నాగశౌర్య స్పోర్ట్స్ డ్రామా లక్ష్య, నాగార్జున-ప్రవీణ్ సత్తారు ప్రాజెక్టులున్నాయి. వీటితోపాటు తమిళ హీరో శివ కార్తికేయన్ తో చేయబోయే సినిమా ప్రకటన కూడా త్వరలోనే బయటకు రానుంది. అంతేకాదు టాలీవుడ్ హీరోలు శర్వానంద్, అడివి శేష్, సుధీర్ బాబు, నిఖిల్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చేసినట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. ఎస్వీసీసీ వారు నైజాం ఏరియా కోసం బిగ్ టికెట్ ఫిలిమ్స్ పంపిణీ హక్కులను పొందారు.
ప్రేక్షకాదరణ పొందుతున్న తమిళ సినిమాల తెలుగు రైట్స్ దక్కించుకునే పనిలో ఉన్న ఎస్వీసీసీ ఉన్నట్టు టాక్. ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ గా నారాయణ్ దాస్ నారంగ్ నుంచి రాబోయే రోజుల్లో వీటితోపాటు మరిన్ని సినిమాలు రానున్నాయి. సినీ పరిశ్రమకు అండగా నిలిచే నారాయణ్ దాస్ నారంగ్ ఆరోగ్యకరమైన, సంపన్నమైన జీవితాన్ని పొందాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరూ కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
కేసు గెలిస్తే కారు నుంచి బైకుకు వచ్చాడు..‘తిమ్మరుసు’ ట్రైలర్
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..