‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎంఎస్ రాజు గత ఏడాది ‘డర్టీ హరి’తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 7 డేస్ 6 నైట్స్ పేరుతో మరో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన తనయుడు, హీరో సుమంత్ నిర్మిస్తున్నారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై రూపొందే ఈ చిత్రనిర్మాణంలో వింటేజ్ పిక్చర్స్, ఏజీబీ క్రియేషన్స్ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు.
ఈ రోజు ఎంఎస్ రాజు పుట్టిన రోజు సందర్భంగా చిత్ర ప్రీలుక్ విడుదల చేశారు. విహార యాత్రకు వెళ్లినప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా చిత్రం రూపొందనుందని తెలుస్తుంది. జూన్ 7న చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఇందులో నటీనటుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నాం’’ అని సుమంత్ అన్నారు. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రం యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుందట.