స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రూపొందుతున్న చిత్రం పుష్ప. వీరిద్దరి కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2 సినిమాలు రూపొందగా, ఈ రెండు సినిమాలకు భిన్నంగా ‘పుష్ప’ సినిమాను సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు బన్నీ చేయనటువంటి మాసీ లుక్ను ‘పుష్ప’ సినిమాలో బన్నీ చేస్తున్నాడు. శేషాలచల అడవుల్లో మాత్రమే దొరికే ఎర్రచందనం, దానికి సంబంధించిన స్మగ్లింగ్పై ‘పుష్ప’ సినిమా రూపొందుతుంది.
పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. ఓ యాక్షన్ సన్నివేశం కోసం రూ. 39 కోట్ల ఖర్చు పెడుతున్నారట. ఇది ప్రేక్షకులకు థ్రిల్ అందించడమే కాకుండా సరికొత్త ఫీలింగ్ అందిస్తుందని అంటున్నారు. ఖర్చు విషయంలో నిర్మాతలు అస్సలు రాజీపడకుండా బెస్ట్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారట. చిత్రంలో రష్మిక మంథాన కథానాయికగా నటిస్తుండగా, స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది